అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రామవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్దం చేశారు. అనంతరం నవీన్ రోడ్డుపై బైఠాయించి రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారంటూ విమర్శించారు. రహదారి దిగ్బంధంతో పోలీసులు నవీన్ను అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఇదీ చూడండి: రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి