తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించారు. తేదేపా గ్రామ కమిటీ ఎన్నికలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీలను ఎంపిక చేశారు. ఒక అనుభవం లేని వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు మాసాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మద్యం కంపెనీల నుంచి వైకాపా ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఆ బ్రాండ్ లకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో సారా ఏరులై పారుతోందని ఆరోపించారు. వైకాపా కార్యకర్తలకు సారా వ్యాపారం ఉపాధిలా మారిందన్నారు.
ఇదీ చదవండి: