ETV Bharat / state

ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య - రంపచోడవరంలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశాడు.

Student suicide by hanging in Rampachodavaram
రంపచోడవరంలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : May 12, 2020, 11:31 AM IST

పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన పట్టెం ఉమేష్ కుమార్ (21).. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక కళాశాలలో పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదివాడు.

సెలవుల కారణంగా కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి నూకరత్నం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఓ సూసైడ్ లెటర్ రాసి జేబులో పెట్టుకుని బలవన్మరణం చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాలిటెక్నిక్ చదువుతున్న ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన పట్టెం ఉమేష్ కుమార్ (21).. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక కళాశాలలో పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదివాడు.

సెలవుల కారణంగా కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి నూకరత్నం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఉరివేసుకుని కనిపించాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఓ సూసైడ్ లెటర్ రాసి జేబులో పెట్టుకుని బలవన్మరణం చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.