తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులోని లంక ప్రాంతాల్లో ఎస్ఈబీ అధికారులు సారా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెలిచేరులోని గోదావరి ఇసుక తిన్నెల్లో నాటు సారా తయారు చేసేందుకు నిల్వ ఉంచిన 8,400 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ శాఖ సిఐ ఏవి చలం ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి