తూర్పుగోదావరి జిల్లా అలమూరు మండలం చెముడులంకలో ఓ పాఠశాలలో గోడకూలి ఆరేళ్ల విద్యార్థి మృతి చెందాడు. మూలస్థానం గ్రామానికి చెందిన ప్రసాద్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లగా గోడ కూలి బాలుడిపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీచదవండి.