గత సంవత్సరకాలంగా కొవిడ్ లాక్డౌన్తో విద్యార్థులు క్రీడలకు దూరంగా ఉన్నారని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి తెలిపారు. వారికి ఇలాంటి పోటీలు ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. సబ్ కలెక్టర్ అనుపమ అంజలి మాట్లాడుతూ క్రీడాకారులు విజయపరంపర కొనసాగించాలన్నారు. డీఈవో ఎస్.అబ్రహం మాట్లాడుతూ విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. నిర్వాహకులు టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తొలిసారి రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని, 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పాల్గొంటారన్నారు. పోటీలను మార్చి 3 నుంచి 8వతేదీ వరకు సంపత్నగరంలోని పాఠశాల ఆవరణలో నిర్వహిస్తామన్నారు. పుష్కర్ఘాట్ వద్ద ప్రారంభమైన ర్యాలీ కంబాలచెరువు వద్దనున్న వివేకానంద విగ్రహం వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: పుర ఎన్నికల ప్రక్రియ పున:ప్రారంభం.. ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే..