ETV Bharat / state

మినీలారీ-ఆటో ఢీ... 16 మందికి గాయాలు

author img

By

Published : Jan 28, 2021, 4:29 PM IST

సిలిండర్​ లోడుతో వెళ్తున్న మినిలారీ, కూలీలతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని 16 మంది వలస కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో ఢీ ... 16 మందికి గాయాలు
మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో ఢీ ... 16 మందికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద 30వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో భద్రాచలం వైపు వెళ్తున్న మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో వాహనం ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన వలస కూలీలు, డ్రైవర్ గాయపడ్డారు. వీరిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గ్యాస్ లారీ వెనక చక్రాలు ఊడిపోయాయి. గ్యాస్ బండలు రోడ్డుపై పడ్డాయి.

నుజ్జునుజ్జయిన ఆటో
నుజ్జునుజ్జయిన ఆటో

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద 30వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో భద్రాచలం వైపు వెళ్తున్న మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో వాహనం ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన వలస కూలీలు, డ్రైవర్ గాయపడ్డారు. వీరిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గ్యాస్ లారీ వెనక చక్రాలు ఊడిపోయాయి. గ్యాస్ బండలు రోడ్డుపై పడ్డాయి.

నుజ్జునుజ్జయిన ఆటో
నుజ్జునుజ్జయిన ఆటో

ఇవీ చదవండి

గిరిజన సంక్షేమ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.