ETV Bharat / state

చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన - east-godavari-district latest news

తూర్పుగోదావరి జిల్లా గొంది గ్రామంలో స్థానికులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువుల సమీపంలో రొయ్యల చెరువుల తవ్వకాలు జరపవద్దని డిమాండ్ చేశారు.

చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన
చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని నిరసన
author img

By

Published : Jun 13, 2021, 5:16 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని గొందిలో రొయ్యల చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువు సమీపంలో 13 ఎకరాలలో గుంతలు తవ్వుతుండటంతో తాగునీరు కలుషితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో ఫిర్యాదు చేయగా.. అప్పుడు తవ్వకాలు ఆపేశారని, ప్రస్తుతం మళ్లీ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని గొందిలో రొయ్యల చెరువుల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రామస్థులు ఆందోళన చేశారు. మంచినీటి చెరువు సమీపంలో 13 ఎకరాలలో గుంతలు తవ్వుతుండటంతో తాగునీరు కలుషితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో ఫిర్యాదు చేయగా.. అప్పుడు తవ్వకాలు ఆపేశారని, ప్రస్తుతం మళ్లీ అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీచదవండి.

కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.