ETV Bharat / state

ద్విచక్ర వాహనాలు ఢీ.. ఓ యువకుడికి గాయాలు - person injured in two wheelers accident at p.gannavaram mandal

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. స్థానికులు హుటాహుటిన అతడిని దగ్గర్లోని సామాజిక ఆసుపత్రికి తరలించారు.

bike accident
ప్రమాదంలో గాయపడిన యువకుడు
author img

By

Published : Nov 12, 2020, 11:28 PM IST

రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంకు చెందిన ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో.. రాజేష్ అనే వ్యక్తికి దెబ్బలు తగిలాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతడిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనం ముందు భాగం ఛిద్రమైంది. మరో వాహనంపై ఇద్దరు ఉన్నారని.. వారికి ఏమీ కాలేదని వివరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెంకు చెందిన ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో.. రాజేష్ అనే వ్యక్తికి దెబ్బలు తగిలాయని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం అతడిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనం ముందు భాగం ఛిద్రమైంది. మరో వాహనంపై ఇద్దరు ఉన్నారని.. వారికి ఏమీ కాలేదని వివరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి: భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.