ETV Bharat / state

అతడి చేతిలో మోసపోయింది.. ఒకరిద్దరు కాదు.. మెుత్తం 30 మంది!

author img

By

Published : May 21, 2020, 9:30 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి క్వారంటైన్​ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. ప్రజా ప్రతినిధి నుంచి 2 లక్షలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. తరువాత తెలిసిందేంటంటే ఇలా మోసపోయిన వారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారని!

person cheats 30 famous personalities
ప్రముఖులను మోసం చేసిన వ్యక్తి

ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికే.. ఓ అపరిచిత వ్యక్తి టోకరా వేసి 2 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

రాజమండ్రి క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. అక్కడే ఉంటున్న మరో వ్యక్తి ఫోన్​తో అమలాపురంకు చెందిన ఓ ప్రజా ప్రతినిధికి ఫోన్ చేశాడు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు స్వల్ప మెుత్తంలో నగదు డిపాజిట్ చేస్తే పెద్ద మెుత్తంలో లబ్ధి చేకూరుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. 2 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసేందుకు ప్రజా ప్రతినిధి అంగీకరించారు. ఆ మాయగాడు తెలివిగా మరొకరి బ్యాంకు ఖాతా ఇచ్చి, దాంట్లో నగదును జమ చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన ఖాతాకు ప్రజా ప్రతినిధి గూగుల్ పే ద్వారా ఆన్​లైన్​లో 2 లక్షలు పంపించారు. అనంతరం ఆ మాయగాడి నుంచి ఎటువంటి స్పందన లేక... మోసపోయానని గమనించిన ప్రజా ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతడి నుంచి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఈ మహా మోసగాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా సుమారు 30 మందికి పైగా ప్రముఖులను మోసం చేసినట్లు తెలిసింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికే.. ఓ అపరిచిత వ్యక్తి టోకరా వేసి 2 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

రాజమండ్రి క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి.. అక్కడే ఉంటున్న మరో వ్యక్తి ఫోన్​తో అమలాపురంకు చెందిన ఓ ప్రజా ప్రతినిధికి ఫోన్ చేశాడు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు స్వల్ప మెుత్తంలో నగదు డిపాజిట్ చేస్తే పెద్ద మెుత్తంలో లబ్ధి చేకూరుతుందని మాయమాటలు చెప్పి నమ్మించాడు. 2 లక్షల రూపాయల నగదును డిపాజిట్ చేసేందుకు ప్రజా ప్రతినిధి అంగీకరించారు. ఆ మాయగాడు తెలివిగా మరొకరి బ్యాంకు ఖాతా ఇచ్చి, దాంట్లో నగదును జమ చేయాలని చెప్పాడు. అతడు చెప్పిన ఖాతాకు ప్రజా ప్రతినిధి గూగుల్ పే ద్వారా ఆన్​లైన్​లో 2 లక్షలు పంపించారు. అనంతరం ఆ మాయగాడి నుంచి ఎటువంటి స్పందన లేక... మోసపోయానని గమనించిన ప్రజా ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతడి నుంచి విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. ఈ మహా మోసగాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా సుమారు 30 మందికి పైగా ప్రముఖులను మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

ఇసుక ర్యాంపులను పరిశీలించిన జేసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.