ETV Bharat / state

అధికారి దురుసు ప్రవర్తన.. ఉపాధ్యాయుల నిరసన - nadu nedu meeting

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పంచాయతీరాజ్ అధికారి.. విద్యాశాఖ అధికారులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

east godavari district
పంచాయతీరాజ్ అధికారి దురుసు ప్రవర్తన.. ఉపాధ్యాయుల నిరసన
author img

By

Published : May 18, 2020, 6:41 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రభుత్వ పాఠశాలలో.. నాడు - నేడు పనులకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ అధికారితో పాటు.. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు సందేహాలు అడుగుతుండగా.. పంచాయతీరాజ్ అధికారి దురుసుగా ప్రవర్తించారని ఉపాధ్యాయులు ఆరోపించారు.

"ఎన్నిసార్లు చెప్పాలి. బయటికి వెళ్లిపోండి" అంటూ అవమానించారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారితోనూ దురుసుగా మాట్లాడారని నిరసన తెలిపారు. ఆ అధికారిని బదిలీ చేసే వరకు తాము నాడు-నేడు సమావేశాలకు హాజరు కాబోమని.. బహిష్కరిస్తున్నామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జ్యోతిబసు తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఝాన్సీకి జరిగిన సంఘటనపై వినతిపత్రం అందించారు.

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రభుత్వ పాఠశాలలో.. నాడు - నేడు పనులకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ అధికారితో పాటు.. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు సందేహాలు అడుగుతుండగా.. పంచాయతీరాజ్ అధికారి దురుసుగా ప్రవర్తించారని ఉపాధ్యాయులు ఆరోపించారు.

"ఎన్నిసార్లు చెప్పాలి. బయటికి వెళ్లిపోండి" అంటూ అవమానించారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారితోనూ దురుసుగా మాట్లాడారని నిరసన తెలిపారు. ఆ అధికారిని బదిలీ చేసే వరకు తాము నాడు-నేడు సమావేశాలకు హాజరు కాబోమని.. బహిష్కరిస్తున్నామని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జ్యోతిబసు తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఝాన్సీకి జరిగిన సంఘటనపై వినతిపత్రం అందించారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లాలో మరో ఐదుగురికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.