అమలాపురం నుంచి బెండమూర్లంక వరకు ఆర్అండ్బీ రహదారి అభివృద్దికి రూ.12 కోట్లు విడుదలైనట్లు ఎంపీ చింతా అనురాధ వెల్లడించారు. రహదారుల సమస్యను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు అల్లవరం మండలం గోడిలంక గ్రామం వద్ద సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి ఆమె రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనురాధ..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి విశ్వరూప్ అన్నారు.
ఇదీచదవండి