ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు అదనపు నీటిని విడుదల చేయటంతో.. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జి రాగంపేట, వడ్లమూరులో పంటలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో మునిగిన పంటలను ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లను సైతం ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కుంగిన వంతెన...మాజీ ఎమ్మెల్యే పరిశీలన