ETV Bharat / state

వైద్య కళాశాలకు భూసేకరణపై మంత్రి విశ్వరూప్ సమావేశం

author img

By

Published : Sep 18, 2020, 3:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైద్య కళాశాల నిర్మాణానికి కావాల్సిన స్థలం కోసం... మంత్రి విశ్వరూప్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. 50 ఎకరాల స్థలం కావాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ స్థలం ఇచ్చేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.

Minister Pinipe Vishwaroop Reiew on New Medical college in Amalapuram
వైద్య కళాశాలకు భూసేకరణపై మంత్రి విశ్వరూప్ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు భూసేకరణపై.. మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సంయుక్త పాలనాధికారి లక్ష్మీసా, అమలాపురం సబ్​కలెక్టర్ హిమాన్సు కౌశిక్, ఇతర అధికారులు హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి రైతులతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల భూమి అవసరం ఉంటుందని.. దీనికోసం రైతులతో మంత్రి మాట్లాడారు. భూమిని ఇచ్చేందుకు రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి వివరించారు. అమలాపురంలో 400 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్ ఏర్పాటుపైనా ఈ సమావేశంలో చర్చించారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసేందుకు భూసేకరణపై.. మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సంయుక్త పాలనాధికారి లక్ష్మీసా, అమలాపురం సబ్​కలెక్టర్ హిమాన్సు కౌశిక్, ఇతర అధికారులు హాజరయ్యారు. భూసేకరణకు సంబంధించి రైతులతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు 50 ఎకరాల భూమి అవసరం ఉంటుందని.. దీనికోసం రైతులతో మంత్రి మాట్లాడారు. భూమిని ఇచ్చేందుకు రైతుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మంత్రి వివరించారు. అమలాపురంలో 400 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్ ఏర్పాటుపైనా ఈ సమావేశంలో చర్చించారు.

ఇదీ చదవండీ... కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.