లాక్ డౌన్ కారణంలో మద్యం షాపులు మూతపడి పుదుచ్చేది ఆదాయానికి గండి పడింది. యానాంలో మద్యం అమ్మకాలు అధికంగా ఉండేవని.. లాక్ డౌన్ కారణంగా ఆ ఆదాయం అంతా తగ్గిపోయిందని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా చెప్పారు.
మూడో దశ లాక్ డౌన్ పూర్తి కావడంతో మద్యం షాపులు తెరిచేందుకు ఉన్న అవకాశాలను శివరాజ్ మీనా వ్యాపారులతో చర్చించారు. ఇటీవల సమీప జిల్లాల్లో మద్యం షాపుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రత.. భౌతిక దూరం వంటివి అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కన్నా ఇక్కడ ధరలు భారీగా తక్కువగా ఉండడంవల్ల ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంచనా వేయాలన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు వ్యాపార వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇవీ చదవండి: