ETV Bharat / state

తూర్పు గోదావరిలో పరమ శివునికి ప్రత్యేక పూజలు - తూర్పు గోదావరి తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే నదీ స్నానాలు ఆచరించి, కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం లింగమూర్తిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

karthika masam
తూర్పు గోదావరిలో పరమ శివునికి ప్రత్యేక పూజలు
author img

By

Published : Dec 7, 2020, 1:23 PM IST

కార్తిక మాసం.. సోమవాారాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అమలాపురం, అయినవిల్లి , అంతర్వేది, పి గన్నవరం, రాజోలు మామిడికుదురుల్లోని ఆలయాల్లో మహేశ్వరుడిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

  • ద్రాక్షారామం

ప్రముఖ శైవ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తికమాసం.. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అఖండ దీపారాధనలు, అభిషేకాలతో పాటు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా దేవాలయ కమిటీ చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండీ...

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

కార్తిక మాసం.. సోమవాారాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అమలాపురం, అయినవిల్లి , అంతర్వేది, పి గన్నవరం, రాజోలు మామిడికుదురుల్లోని ఆలయాల్లో మహేశ్వరుడిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

  • ద్రాక్షారామం

ప్రముఖ శైవ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తికమాసం.. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అఖండ దీపారాధనలు, అభిషేకాలతో పాటు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా దేవాలయ కమిటీ చర్యలు తీసుకుంది.

ఇదీ చదవండీ...

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.