తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కాకినాడకు చెందిన నయనాల వెంకట గాంధీ అనే వ్యక్తి.. బోటుకు ఐవీ రిజిస్ట్రేషన్ లైసెన్సు నిమిత్తము బోటు అధికారులను సంప్రదించగా.. 60 వేల రూపాయలు లంచం అడగడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు లంచం తీసుకుంటుండగా పోర్టు కన్జర్వేటివ్ అధికారి దంగేటి వెంకట్ రావును నేరుగా పట్టుకున్నారు. రాజమండ్రి అనిశా డీఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
ఇదీ చదవండి: అధికారి మోసం.... కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం!