ETV Bharat / state

'ప్రాచీన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ' - legislative council chairman sharief in kakinada

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు గ్రంథాలయాన్ని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సందర్శించారు. ప్రాచీన గ్రంథాల పునఃముద్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

legislative council chairman
శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్
author img

By

Published : Jan 21, 2021, 5:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు గ్రంథాలయాన్ని.. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న ప్రాచీన విజ్ఞాన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

తెలుగు సాహిత్యంపై ఔత్సాహికులు పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్, ప్రాచీన గ్రాంథాలు, తెలుగు నిఘంటువులను పునఃముద్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కమిటీ ఛైర్మన్ షరీఫ్​తో పాటు సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్ మాధవ్, ప్రత్యేక ఆహ్వానితులు బాలసుబ్రమణ్యం తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, తెలుగు శాసనాలను పరిశీలించారు. అనంతరం సాహితీ ప్రియులతో సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో పలు ప్రారంభోత్సవాలు..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు గ్రంథాలయాన్ని.. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న ప్రాచీన విజ్ఞాన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

తెలుగు సాహిత్యంపై ఔత్సాహికులు పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్, ప్రాచీన గ్రాంథాలు, తెలుగు నిఘంటువులను పునఃముద్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కమిటీ ఛైర్మన్ షరీఫ్​తో పాటు సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్ మాధవ్, ప్రత్యేక ఆహ్వానితులు బాలసుబ్రమణ్యం తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, తెలుగు శాసనాలను పరిశీలించారు. అనంతరం సాహితీ ప్రియులతో సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో పలు ప్రారంభోత్సవాలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.