ETV Bharat / state

Rains : పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

author img

By

Published : Sep 2, 2021, 12:47 PM IST

రాష్ట్రంలో నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Heavy rains in many places
పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలో వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నెల్లూరులోని అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండటంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాల్లోనే ఉంది. ధాన్యం తడిసిపోతుందని రైతులు భయపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు నీట మునగడంతో రాపపోకలకు అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం మన్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భూపతిపాలెం జలాశయం వద్ద మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కొండలపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటిన కొండలపై పొగమంచు వీడలేదు.

Dense fog over the hills on the Maredumilli main road
మారేడుమిల్లి ప్రధాన రహదారిలో ఉన్న కొండలపై కమ్మిన దట్టమైన పొగమంచు

ఇదీ చదవండి: Fraud: రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం

నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నెల్లూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెంలో వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నెల్లూరులోని అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. జిల్లాలో ప్రస్తుతం వరి కోతలు జరుగుతుండటంతో నూర్పిడి చేసిన ధాన్యం పొలాల్లోనే ఉంది. ధాన్యం తడిసిపోతుందని రైతులు భయపడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. రహదారులు నీట మునగడంతో రాపపోకలకు అంతరాయం ఏర్పడింది. రంపచోడవరం మన్యంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భూపతిపాలెం జలాశయం వద్ద మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కొండలపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటిన కొండలపై పొగమంచు వీడలేదు.

Dense fog over the hills on the Maredumilli main road
మారేడుమిల్లి ప్రధాన రహదారిలో ఉన్న కొండలపై కమ్మిన దట్టమైన పొగమంచు

ఇదీ చదవండి: Fraud: రైటర్ బిజినెస్ సర్వీసెస్ పేరుతో 1.26 కోట్ల ఘరానా మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.