ETV Bharat / state

ఇవాళ 18 మృతదేహాలు లభ్యం... మరో 21 మంది కోసం గాలింపు

author img

By

Published : Sep 17, 2019, 10:31 AM IST

Updated : Sep 17, 2019, 2:59 PM IST

బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరిలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అగ్నిమాపకదళం, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహాలు ఎవరివన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మొత్తం 73 మందిలో 26 మంది సురక్షితం, 26 మృతదేహాలు లభ్యం, మరో 21 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

boat
godavari-boat-accident-in-ap
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం-315 అడుగుల లోతులో బోటు
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం... మరో 21 మంది కోసం గాలింపు

బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇవాళ ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 12, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2, పోలవరం మండలంలో 2, తాళ్లపూడిలో ఒక మృతదేహం లభ్యమయ్యాయి. ఆదివారం 8 మృతదేహాలను సహాయసిబ్బంది గుర్తించారు. బోటు ప్రమాదంలో మొత్తం ఇవాళ్టికి 26 మృతదేహాలు గుర్తించారు. మొత్తం 73 మందిలో 26 మంది సురక్షితం, 26 మృతదేహాలు లభ్యం, మరో 21 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలువురి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి మొత్తం 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు ఒక్కొక్కటిగా వివిధ ప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. 14 మంది మృతదేహాలు నీళ్ల పైకి తేలగా, మరో ఇద్దరి మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు..... మృతుడు హైదరాబాద్‌ మాదాపూర్‌ వాసి ఇ.సాయికుమార్‌గా గుర్తించారు.

పోలవరం ఇసుక రేవు వద్ద, కచ్చులూరు వద్ద, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. తాళ్లపూడి వద్ద ఒకటి, ధవళేశ్వరం వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. విజ్జేస్వరం లాకుల వద్ద 17వ నెంబర్ గేట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది..... బోటు ప్రమాద మృతుడిగా అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు కనుగొనే పనిలో ఉన్నారు.

315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైనవారి కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు, వరద ఉద్ధృతి ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి. సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది. పోలవరం వద్ద దొరికిన మృతదేహం నరసాపురానికి చెందిన బి.ఎస్‌.ఫణికుమార్‌గా గుర్తించారు.

godavari-boat-accident-in-ap
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం-315 అడుగుల లోతులో బోటు
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం... మరో 21 మంది కోసం గాలింపు

బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇవాళ ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 12, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2, పోలవరం మండలంలో 2, తాళ్లపూడిలో ఒక మృతదేహం లభ్యమయ్యాయి. ఆదివారం 8 మృతదేహాలను సహాయసిబ్బంది గుర్తించారు. బోటు ప్రమాదంలో మొత్తం ఇవాళ్టికి 26 మృతదేహాలు గుర్తించారు. మొత్తం 73 మందిలో 26 మంది సురక్షితం, 26 మృతదేహాలు లభ్యం, మరో 21 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలువురి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి మొత్తం 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు ఒక్కొక్కటిగా వివిధ ప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. 14 మంది మృతదేహాలు నీళ్ల పైకి తేలగా, మరో ఇద్దరి మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు..... మృతుడు హైదరాబాద్‌ మాదాపూర్‌ వాసి ఇ.సాయికుమార్‌గా గుర్తించారు.

పోలవరం ఇసుక రేవు వద్ద, కచ్చులూరు వద్ద, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. తాళ్లపూడి వద్ద ఒకటి, ధవళేశ్వరం వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. విజ్జేస్వరం లాకుల వద్ద 17వ నెంబర్ గేట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది..... బోటు ప్రమాద మృతుడిగా అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు కనుగొనే పనిలో ఉన్నారు.

315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైనవారి కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు, వరద ఉద్ధృతి ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి. సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది. పోలవరం వద్ద దొరికిన మృతదేహం నరసాపురానికి చెందిన బి.ఎస్‌.ఫణికుమార్‌గా గుర్తించారు.

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగుల పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు నియోజకవర్గ కేంద్రమైన ఎలమంచిలి పట్టణంలో 9 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు వీటిలో రెండు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు పరీక్షా కేంద్రాల వద్ద వీరిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు జిల్లా ఎస్పీ తదితర ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం ఎనిమిది గంటలకే అభ్యర్థులు బారులు తీరారు యువతుల కోసం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నది వాహనాలు 104 అంబులెన్స్ ను సిద్ధం చేశారు అన్ని చోట్ల అభ్యర్థులకు పూర్తిస్థాయి వసతులు కల్పించారు బస్సులు చాలిక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు గట్టి నిజానికి ఈ పరీక్షలు జరిగాయి


Body:ఓవర్


Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ AP 10146
Last Updated : Sep 17, 2019, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.