ETV Bharat / state

'రంపచోడవరం ఆసుపత్రిలో.. రోగులకు చాలీచాలని భోజనం'

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు చాలీచాలని భోజనం పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. ఈ విషయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

author img

By

Published : Jan 23, 2021, 7:20 AM IST

Former MLA Vanthala Rajeshwari visits patients at Regional Hospital Rampachodavaram East Godavari District
రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు చాలీచాలని భోజనం

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సేవల గురించి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.. ప్రత్యక్షంగా పరిశీలించారు. చాలీచాలని భోజనం పెడుతున్నారని రోగులు చెప్పగా.. ఆమె మండిపడ్డారు. ఈ సమస్యను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రోగులకు పాలు, రొట్టె, గుడ్డు అందించేవారని.. ప్రస్తుతం అవి అందడం లేదని ఆగ్రహించారు. ఈ విషయంపై తేదేపా ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగవరం ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణను రాజేశ్వరి పరామర్శించారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నాయకులు మెహర్ బాబా, రాయపల్లి చౌదరి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సేవల గురించి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.. ప్రత్యక్షంగా పరిశీలించారు. చాలీచాలని భోజనం పెడుతున్నారని రోగులు చెప్పగా.. ఆమె మండిపడ్డారు. ఈ సమస్యను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రోగులకు పాలు, రొట్టె, గుడ్డు అందించేవారని.. ప్రస్తుతం అవి అందడం లేదని ఆగ్రహించారు. ఈ విషయంపై తేదేపా ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగవరం ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణను రాజేశ్వరి పరామర్శించారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నాయకులు మెహర్ బాబా, రాయపల్లి చౌదరి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:

వశిష్ట గోదావరి మీద వంతెన నిర్మాణానికి త్వరలో టెండర్లు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.