తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి మందుగుండు సామగ్రికి కేంద్ర పాలిత యానాం కేరాఫ్ అడ్రస్. ఏటా నెల రోజుల ముందు నుంచే ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు, ఉభయ గోదావరి జిల్లాల రిటైల్ వ్యాపారులు సరకు కొనుగోలు చేస్తారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి.
కరోనా ప్రభావంతో ఈ ఏడాది పండుగకు నాలుగు రోజుల ముందు కూడా కొనుగోలుదార్లు రాకపోవడంతో.. వ్యాపారం వెలవెలబోయింది. దీపావళి మందుగుండు నుంచి వెలువడే పొగతో కరోనా ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం హెచ్చరించడంతో.. స్థానికులు కొనేందుకు వెనుకాడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ కోసం.. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులంతా లబోదిబోమంటున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తగిలి అగ్నిప్రమాదం...ఇల్లు దగ్ధం