తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21న ఓ ఇంటిపై పెట్రోల్పై పోసి నలుగురి మరణానికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా రావికవతంలో ప్రధాన నిందితుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన మరో వ్యక్తి మోహన్ను పట్టుకున్నారు. తనకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదనే ఉన్మాదంలో అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ నిందితులు ఇంటి బయట గొళ్లెం పెట్టి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు, ఒక చిన్నారి మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. ఇది అరుదైన కేసు అని నిందితులను 9 బృందాలతో గాలించామని ఎస్పీ హిమోషీభాజ్పేయ్ తెలిపారు.
ఇదీ చూడండి: