తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో యువకులు వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి నాలుగు గుడ్లను పంచిపెట్టారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు జ్యోతి వెలిగింపు కార్యక్రమం, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ద్వారపూడి బ్రహ్మానందం, ఆకేటి రామకృష్ణ , గంధం ఈశ్వరరావు, కర్రి కార్తీక్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:500 కుటుంబాలకు దాత కూరగాయల వితరణ