ETV Bharat / state

కాశీకి పోయి కరోనా తెచ్చిన మహిళ.. ఉలిక్కిపడ్డ గ్రామస్థులు

author img

By

Published : Mar 24, 2021, 9:17 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామానికి చెందిన ఆ మహిళకు కరోనా పాజిటివ్ రావటంతో.. గ్రామస్థులు, అధికారులు ఉలిక్కి పడ్డారు. కాశీకి వెళ్లి వచ్చిన ఆమె గ్రామస్థులకు భోజనాలు ఏర్పాటు చేయటం.. అనంతరం ఆమెకు పాజిటివ్​గా తేలటంతో.. అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించారు.

corona positive to woman
కాశీకిపోయి కరోనా తెచ్చిన మహిళ

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ముంగండ గ్రామానికి చెందిన ఒక మహిళ.. యాత్ర బస్సులో కాశీకి వెళ్లి ఈ నెల 19న వచ్చారు. ఆమెతో పాటు బస్సులో ఉన్న మిగిలిన వారికి ఈనెల 19న పలివెలలో కరోనా పరీక్షలు చేశారని పీహెచ్​సీ వైద్యాధికారి కె.సుబ్బరాజు తెలిపారు. ముంగండ గ్రామానికి చెందిన ఆ మహిళకు కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చేసరికి.. స్థానికంగా ఆందోళన మొదలైంది.

కాశీకి వెళ్లి వచ్చిన సందర్భంగా.. గ్రామంలో ఇరుగుపొరుగు వారిని పిలిచి భోజనాలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించి.. కరోనా నివారణ చర్యలు చేపట్టామని ముంగండ పంచాయతీ కార్యదర్శి డి.సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఆమెతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న 20 మంది పైబడి ఉన్నట్టు గుర్తించామని... వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తామని పీహెచ్​సీ వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని ముంగండ గ్రామానికి చెందిన ఒక మహిళ.. యాత్ర బస్సులో కాశీకి వెళ్లి ఈ నెల 19న వచ్చారు. ఆమెతో పాటు బస్సులో ఉన్న మిగిలిన వారికి ఈనెల 19న పలివెలలో కరోనా పరీక్షలు చేశారని పీహెచ్​సీ వైద్యాధికారి కె.సుబ్బరాజు తెలిపారు. ముంగండ గ్రామానికి చెందిన ఆ మహిళకు కరోనా పాజిటివ్ గా ఫలితం వచ్చేసరికి.. స్థానికంగా ఆందోళన మొదలైంది.

కాశీకి వెళ్లి వచ్చిన సందర్భంగా.. గ్రామంలో ఇరుగుపొరుగు వారిని పిలిచి భోజనాలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఆమె కాళ్లు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్​గా ప్రకటించి.. కరోనా నివారణ చర్యలు చేపట్టామని ముంగండ పంచాయతీ కార్యదర్శి డి.సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో ఆమెతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న 20 మంది పైబడి ఉన్నట్టు గుర్తించామని... వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు చేస్తామని పీహెచ్​సీ వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు.

ఇవీ చూడండి:

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. యానాంలో ప్రచార సందడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.