తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. వైస్ చైర్మన్గా ఎన్నికైన అభ్యర్థి సోదరుడు, కౌన్సిలర్ నేతల హరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్గా గంగిరెడ్డి అరుణ, వైస్ చైర్మన్గా ఉబా జాన్ మోజేశ్ ఎంపికయ్యారు. ప్రమాణ స్వీకారణం అనంతరం రెండో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించకపోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హరిబాబు, కృష్ణ.. ఎన్నికల అధికారి, జడ్పీ సీఈవో సత్యనారాయణతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం బయటకు వెళ్లిన తర్వాత నేతల హరిబాబు తనకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ చైర్మన్ జాన్ మోజెస్ వర్గం సభ్యులు, నేతల హరిబాబుతో ఘర్షణకు దిగారు. అధికార పక్ష సభ్యులే బహిరంగంగా గొడవపడటం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: విజయవాడ మేయర్గా రాయన భాగ్యలక్ష్మి