సీఎం జగన్ సంప్రదాయాలు పాటించడం లేదని.. హిందూ దేవాలయాలపై మంత్రులతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. తిరుమలలో సంప్రదాయాలకు తిలోదకాలు వదిలి పట్టు వస్త్రాలు సమర్పించారని అన్నారు. ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా.. నిందితుల్ని పట్టుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనాతో ఆసుపత్రుల్లో వైద్యం అందక జనం పడరాని పాట్లు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పెట్రోలు, నిత్యావసర ధరలు పెరిగి విలవిలలాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా పిలుపు మేరకు చిన రాజప్ప పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పూజలు చేశారు.
ఇదీ చదవండి: రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే