అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు యువకులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన సురేశ్, మురళి అనే యువకులు బైక్పై 100 లీటర్ల సారా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని లింగంపర్తి వద్ద అడ్డుకున్నారు. నాటుసారాను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
ఇవీ చదవండి.. మైలవరంలో మద్యం దుకాణాల తనిఖీ