ETV Bharat / state

పోలవరం కాపర్​ డ్యాం పనులను పరిశీలించిన కేంద్ర బృందం

author img

By

Published : Dec 8, 2020, 7:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంగుళూరు వద్ద నిర్మిస్తున్న పోలవరం కాపర్ డ్యాం పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కాపర్ డ్యాం నిర్మాణ ప్రదేశంలో మట్టిని నిపుణుల బృందం పరీక్షించింది.

polavaram copper dam
polavaram copper dam

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం పనులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ బృందంలోని నలుగురు నిపుణులు కాపర్ డ్యాం నిర్మిస్తున్న ప్రదేశంలో 100 మీటర్లకు ఒక్కొక్కచోట మట్టిని పరీక్షించారు. ఈ బృందంలో దిల్లీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు సురేశ్ మౌర్య, రాజీవ్ బారది, పలని కుమార్, హరేంద్ర ప్రకాష్ ఉన్నారు. బుధవారం కూడా కాపర్ డ్యాం మట్టి నమూనాలతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను ఈ బృందం పరిశీలించనుంది.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం పనులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఈ బృందంలోని నలుగురు నిపుణులు కాపర్ డ్యాం నిర్మిస్తున్న ప్రదేశంలో 100 మీటర్లకు ఒక్కొక్కచోట మట్టిని పరీక్షించారు. ఈ బృందంలో దిల్లీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు సురేశ్ మౌర్య, రాజీవ్ బారది, పలని కుమార్, హరేంద్ర ప్రకాష్ ఉన్నారు. బుధవారం కూడా కాపర్ డ్యాం మట్టి నమూనాలతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులను ఈ బృందం పరిశీలించనుంది.

ఇదీ చదవండి : భూకబ్జాకు స్థానిక నేత యత్నం...మహిళా రైతు ఆరోపణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.