ETV Bharat / state

ఆన్‌లైన్‌ ద్వారా సత్యదేవుడి నిత్య కల్యాణం

అన్నవరం సత్యనారాయణ స్వామి నిత్య కల్యాణం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చేవారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో.. వచ్చేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు.. అన్నవరం సత్యనారాయణ స్వామి నిత్యకల్యాణాన్ని భక్తులు ఇంటి నుంచే చూసి తరించేందుకు ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : Apr 28, 2021, 9:38 AM IST

annavaram
ఆన్‌లైన్‌ ద్వారా సత్యదేవుడి నిత్య కల్యాణం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆన్‌లైన్‌ ద్వారా సత్యదేవుడి నిత్య కల్యాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ రూ.1,116 రుసుం చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా స్వామివారి నిత్య కల్యాణాన్ని మంగళవారం ప్రారంభించారు. నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరుగుతుంది. ఈ ప్రక్రియను చిత్రీకరించి యూట్యూబ్‌కు అనుసంధానిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.1,116 రుసుం చెల్లించే భక్తులకు ఈ యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తారు. పరోక్ష పద్ధతిలో నిత్య కల్యాణంలో పాల్గొనే భక్తులకు పోస్టల్‌ ద్వారా ప్రసాదం, రవిక, కండువా పంపిస్తారు.

అన్నవరం దేవస్థానంలో మొదటిసారి ఈ హుండీని ప్రారంభించామని, మరో 4నెలల్లో అన్ని దేవాలయాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని వాణీమోహన్‌ తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆన్‌లైన్‌ ద్వారా సత్యదేవుడి నిత్య కల్యాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ రూ.1,116 రుసుం చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా స్వామివారి నిత్య కల్యాణాన్ని మంగళవారం ప్రారంభించారు. నిత్యం స్వామి, అమ్మవార్లకు కల్యాణం జరుగుతుంది. ఈ ప్రక్రియను చిత్రీకరించి యూట్యూబ్‌కు అనుసంధానిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.1,116 రుసుం చెల్లించే భక్తులకు ఈ యూట్యూబ్‌ లింక్‌ పంపిస్తారు. పరోక్ష పద్ధతిలో నిత్య కల్యాణంలో పాల్గొనే భక్తులకు పోస్టల్‌ ద్వారా ప్రసాదం, రవిక, కండువా పంపిస్తారు.

అన్నవరం దేవస్థానంలో మొదటిసారి ఈ హుండీని ప్రారంభించామని, మరో 4నెలల్లో అన్ని దేవాలయాల సేవలు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని వాణీమోహన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: మాస్కుల ప్రాముఖ్యతపై కలెక్టర్ వినూత్న ప్రచారం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.