ఎక్సైజ్ ఎస్సై అయినా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వైకాపాకు చెందిన కౌన్సిలర్పై తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు కేసునమోదు చేశారు. అమలాపురానికి చెందిన కోడూరు సత్యదుర్గాప్రసాద్ తెలంగాణ నుంచి 560 మద్యం సీసాలను.. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా రప్పించాడు. అమలాపురానికి వచ్చిన ఆ మద్యం సీసాలను దుర్గాప్రసాద్ జీపులలో తీసుకెళ్తుండగా.. ఎక్సైజ్ అధికారులకు తనిఖీలు నిర్వహించారు. దుర్గాప్రసాద్తో పాటు జీపుని, మద్యం సీసాలను వారు స్టేషన్కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక వైకాపాకు చెందిన కౌన్సిలర్ దొమ్మేటి రాము.. ఎక్సైజ్ ఎస్సై విజయలక్ష్మి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి. దూసనపూడి సర్పంచ్పై అర్ధరాత్రి దాడి