తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడారు. యువత పెడదారి పడుతుందోని.. కళాశాలలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యువతలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరహా ఘటనలను ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాలలో లోపాలను సరిదిద్దాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు.
ఇదీ చదవండి