ETV Bharat / state

'అలా చేయకపోతే ఉద్యోగం ఉండదు... జాగ్రత్త!'

'ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు వైకాపా వారే అర్హులుగా ఉండాలి.. వారి పేర్లే నువ్వు నమోదు చేయాలి.. లేకపోతే నీ ఉద్యోగం ఉండదు.' అంటూ గ్రామ వాలంటీర్​ను వైకాపా నాయకులు బెదిరించారంటూ.. చిత్తూరు జిల్లా రెంతకుంట్లకు చెందిన వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

author img

By

Published : May 24, 2020, 12:50 PM IST

ycp leader savitramma threating volunteer in renthakunta chittore district
సౌమ్య, గ్రామ వాలంటీర్

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్ప ఇతరులెవరికీ ప్రభుత్వ ఫలాలు అందకుండా చూడాలని... సంక్షేమ పథకాలకు పేర్ల నమోదులో తమ పార్టీ వారే ఉండాలంటూ.. వైకాపా నాయకురాలు తనను వేధిస్తున్నారని.. ఓ గ్రామవాలంటీరు వాపోయింది.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెంతకుంట్ల వైకాపా నాయకురాలు సావిత్రమ్మ తరచూ తన విధులకు ఆటంకం కలిగిస్తోందంటూ.. గ్రామ వాలంటీర్ సౌమ్య ఆరోపించింది. సబ్సిడీ విత్తనాలు పంపిణీ, ఇళ్ల స్థలాల సంబంధించి అన్నింటిలో తనను బెదిరిస్తోందని వాపోయింది. ఈ విషయమై సావిత్రమ్మ తనపై దాడికి ప్రయత్నించిందంటూ సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్ప ఇతరులెవరికీ ప్రభుత్వ ఫలాలు అందకుండా చూడాలని... సంక్షేమ పథకాలకు పేర్ల నమోదులో తమ పార్టీ వారే ఉండాలంటూ.. వైకాపా నాయకురాలు తనను వేధిస్తున్నారని.. ఓ గ్రామవాలంటీరు వాపోయింది.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం రెంతకుంట్ల వైకాపా నాయకురాలు సావిత్రమ్మ తరచూ తన విధులకు ఆటంకం కలిగిస్తోందంటూ.. గ్రామ వాలంటీర్ సౌమ్య ఆరోపించింది. సబ్సిడీ విత్తనాలు పంపిణీ, ఇళ్ల స్థలాల సంబంధించి అన్నింటిలో తనను బెదిరిస్తోందని వాపోయింది. ఈ విషయమై సావిత్రమ్మ తనపై దాడికి ప్రయత్నించిందంటూ సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి:

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలంలో ఉద్రిక్తత

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.