ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Feb 4, 2021, 2:31 PM IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో మంత్రి శంకర్ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ స్వామివారిని దర్శించుకున్నారు.

vips at darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి శంకర్‌ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌జైన్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిచినట్లు మంత్రి తెలిపారు. దేశం అభివృద్ది వైపు నడిచి ఆర్థిక ప్రగతి సాధించాలని కోరుకున్నానన్న జీవీఎల్‌... అయోధ్యలో రామమందిర నిర్మాణంతో అనేక శతాబ్దాలుగా కల నెరవేరబోతుందన్నారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రి శంకర్‌ నారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు, తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌జైన్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థిచినట్లు మంత్రి తెలిపారు. దేశం అభివృద్ది వైపు నడిచి ఆర్థిక ప్రగతి సాధించాలని కోరుకున్నానన్న జీవీఎల్‌... అయోధ్యలో రామమందిర నిర్మాణంతో అనేక శతాబ్దాలుగా కల నెరవేరబోతుందన్నారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించా: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.