ETV Bharat / state

ముప్పై అడుగుల లోతులో పడ్డ బైక్.. ఇద్దరు మృతి! - ముంగిలిపట్టు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

accident at mungilipattu national highway: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రహదారి వంతెన పైనుంచి ద్విచక్రవాహనం కిందపడటంతో ప్రమాదం చోటు చేసుకుంది.

two died in accident at mungilipattu national highway at chittor district
ముంగిలిపట్టు జాతీయ రహదారి ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Dec 27, 2021, 8:24 PM IST

accident at mungilipattu national highway: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రహదారి వంతెన పైనుంచి ద్విచక్రవాహనం కిందపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని జీడీ నెల్లూరుకు చెందిన తులసీరామ్.. చిత్తూరులో వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనుల నిమిత్తం.. మణికంఠ అనే వ్యక్తితో కలసి తిరుపతికి వెళ్లాడు. చిత్తూరుకు తిరిగి వస్తుండగా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై నడింపల్లి వద్ద గల కల్వర్టును బైక్ ఢీకొనడంతో.. బ్రిడ్జిపై నుంచి ముప్పై అడుగుల లోతులో కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో తులసిరామ్ చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు.. చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ తులసిరామ్​ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

accident at mungilipattu national highway: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రహదారి వంతెన పైనుంచి ద్విచక్రవాహనం కిందపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

జిల్లాలోని జీడీ నెల్లూరుకు చెందిన తులసీరామ్.. చిత్తూరులో వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనుల నిమిత్తం.. మణికంఠ అనే వ్యక్తితో కలసి తిరుపతికి వెళ్లాడు. చిత్తూరుకు తిరిగి వస్తుండగా పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై నడింపల్లి వద్ద గల కల్వర్టును బైక్ ఢీకొనడంతో.. బ్రిడ్జిపై నుంచి ముప్పై అడుగుల లోతులో కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో తులసిరామ్ చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు.. చంద్రగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ తులసిరామ్​ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

corruption : నిధులు కాజేశారంటూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.