ETV Bharat / state

24 మందితో తితిదే పాలకమండలి - latest news on ttd governing body

తితిదే పాలక మండలి సభ్యులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.  ఈమేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలకు చెందిన 24 మందితో ప్రకటన వెలువడవచ్చని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

24 మందితో తితిదే పాలకమండలి
author img

By

Published : Sep 18, 2019, 5:17 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిలో... తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలకు చెందిన 24 మందిని నియమించనున్నట్టు సమాచారం. ఒకటి రెండు పేర్లపై తర్జనభర్జనలు చోటుచేసుకోవటం వల్ల జాబితా ప్రకటనలో ఆలస్యమైందని .... నేడు ప్రకటన వెలువడవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు

ఏపీ నుంచి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, కె. పార్థసారథి. ఇతరుల కోటాలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, వైకాపా ప్రొద్దుటూరు నగర అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌,
తెలంగాణ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు, డి.దామోదర్​రావు, హెటిరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథి రెడ్డి, కావేరి సీడ్స్ ఎండీ భాస్కరరావు సతీమణి జి. వనజాదేవి, మూరంశెట్టి రాములు, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌ రెడ్డి, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్, డాక్టర్ నిచితా ముత్తవరపు, ఎమ్మెల్యే కుమారగురు, కర్ణాటక నుంచి రమేష్‌ శెట్టి, సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి, మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మ, ఢిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్​లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి గతంలోనూ సభ్యులుగా పనిచేశారు. గతంలో తమిళనాడు నుంచి ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి పళనిస్వామి సిఫార్సుపై తొలిసారిగా ఉలుందూర్ పేట ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తున్నారని చెబుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కోరిక మేరకు డాక్టర్ నిచితా ముత్తవరపునకు అవకాశమిచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి: తిరుమల బ్రహ్మోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిలో... తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీలకు చెందిన 24 మందిని నియమించనున్నట్టు సమాచారం. ఒకటి రెండు పేర్లపై తర్జనభర్జనలు చోటుచేసుకోవటం వల్ల జాబితా ప్రకటనలో ఆలస్యమైందని .... నేడు ప్రకటన వెలువడవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు

ఏపీ నుంచి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, యూవీ రమణమూర్తి, గొల్ల బాబూరావు, కె. పార్థసారథి. ఇతరుల కోటాలో వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి, నాదెండ్ల సుబ్బారావు, వైకాపా ప్రొద్దుటూరు నగర అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌,
తెలంగాణ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త జూపల్లి రామేశ్వరరావు, డి.దామోదర్​రావు, హెటిరో డ్రగ్స్ ఎండీ బి.పార్థసారథి రెడ్డి, కావేరి సీడ్స్ ఎండీ భాస్కరరావు సతీమణి జి. వనజాదేవి, మూరంశెట్టి రాములు, కె.శివకుమార్, పుత్తా ప్రతాప్‌ రెడ్డి, తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్, డాక్టర్ నిచితా ముత్తవరపు, ఎమ్మెల్యే కుమారగురు, కర్ణాటక నుంచి రమేష్‌ శెట్టి, సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి, మహరాష్ట్ర నుంచి రాజేష్‌ శర్మ, ఢిల్లీ నుంచి ఎంఎస్ శివశంకరన్​లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి సంపత్ రవినారాయణ, డీపీ ఆంత, సుధా నారాయణమూర్తి గతంలోనూ సభ్యులుగా పనిచేశారు. గతంలో తమిళనాడు నుంచి ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ముఖ్యమంత్రి పళనిస్వామి సిఫార్సుపై తొలిసారిగా ఉలుందూర్ పేట ఎమ్మెల్యేకు చోటు కల్పిస్తున్నారని చెబుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కోరిక మేరకు డాక్టర్ నిచితా ముత్తవరపునకు అవకాశమిచ్చినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి: తిరుమల బ్రహ్మోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు

Intro:ప్రశాంత వాతావరణంలో గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణ


Body:గ్రామ సచివాలయ పరీక్షలకు తరలివచ్చిన అభ్యర్థులు


Conclusion:చిత్తూరు జిల్లా మదనపల్లిలో గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అయినా కొంత మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు తెలియక ఇబ్బందులు పడ్డారు పట్టణ శివారు ప్రాంతంలోని పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది పరీక్ష రాయడానికి మదనపల్లిలో 39 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇందులో పదివేల 68 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు వారు ప్రారంభమయ్యాయి పట్టణంలోని నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ కేంద్రంలో నూట పది మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఇందులో ఎక్కువ భాగం వికలాంగులు ఉన్నారు పరీక్ష కేంద్రంలోకి వెళ్లడానికి రాంప్ లేకపోవడంతో వికలాంగులు పలు అవస్థలు పడ్డారు కొంతమంది సహాయకులు వీరిని చేతుల సాయంతో మెట్లపై తీసుకెళ్లి పరీక్ష కేంద్రంలో వదిలారు పూర్తిగా నడవలేని వారికి పై అంతస్తులో గదిని కేటాయించడంతో స్థానికంగా ఉన్న అధికారులు వారికి కింద గదిలోనే పరీక్ష రాయడానికి ఏర్పాటు చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.