ETV Bharat / state

పూల‌తో పాటు ఔషధ మొక్కలు పెంచాలి: తితిదే ఈవో

author img

By

Published : Dec 4, 2020, 7:35 PM IST

తిరుమలలో 10 ఎక‌రాల విస్తీర్ణంలో పూల మొక్కల‌తో పాటు ఔషధ మొక్కలు పెంచాలని అధికారులకు తితిదే ఈవో జవహర్‌ రెడ్డి సూచించారు. స్థానికంగా ఉన్న ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు.

Jawahar reddy inspected several places in Tirumala
పూల మొక్కల‌తో పాటు ఔషధ మొక్కలు పెంచాలి: తితిదే ఈవో

తిరుమలలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి తితిదే ఈవో జవహర్‌ రెడ్డి పరిశీలించారు. జీఎన్‌సీ టోల్ గేట్ వ‌ద్ద ఉన్న గీతా ఉద్యాన‌వ‌నం, ప‌ద్మావ‌తి నగర్​లోని ఉద్యానవానాలను అట‌వీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాల‌ని సూచనలు చేశారు. 10 ఎక‌రాల విస్తీర్ణంలో పూల మొక్కల‌తో పాటు ఔషధ మొక్కలు పెంచాలన్నారు.

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శిలాతోర‌ణాన్ని ప‌రి‌శీలించి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. తిరుమ‌ల విద్యుత్‌ అవ‌స‌రాల‌కు ధ‌ర్మగిరి అటవీ ప్రాంతంలో 20 ఎక‌రాల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి తితిదే ఈవో జవహర్‌ రెడ్డి పరిశీలించారు. జీఎన్‌సీ టోల్ గేట్ వ‌ద్ద ఉన్న గీతా ఉద్యాన‌వ‌నం, ప‌ద్మావ‌తి నగర్​లోని ఉద్యానవానాలను అట‌వీ విభాగం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాల‌ని సూచనలు చేశారు. 10 ఎక‌రాల విస్తీర్ణంలో పూల మొక్కల‌తో పాటు ఔషధ మొక్కలు పెంచాలన్నారు.

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శిలాతోర‌ణాన్ని ప‌రి‌శీలించి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. తిరుమ‌ల విద్యుత్‌ అవ‌స‌రాల‌కు ధ‌ర్మగిరి అటవీ ప్రాంతంలో 20 ఎక‌రాల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండీ:

రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.