ETV Bharat / state

తెదేపా 'చలో తంబళ్లపల్లె': ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

author img

By

Published : Dec 12, 2020, 7:51 AM IST

Updated : Dec 12, 2020, 12:09 PM IST

చిత్తూరు జిల్లా అంగళ్లులో శుక్రవారం తెలుగుదేశం నేతలపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పార్టీ పిలుపునివ్వడంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు మోహరించారు. తంబళ్లపల్లెకు వెళ్తున్న తెదేపా నాయకులను జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు.

tdp
tdp
తెదేపా 'చలో తంబళ్లపల్లె': ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

ఇటీవల తంబళ్లపల్లెలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు తెలుగుదేశం నేతలు వెళ్తుండగా మార్గమధ్యంలో వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తెలుగుదేశం నేతల వాహనాలను అడ్డుకున్న వైకాపా శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో తెదేపా నేతల వాహనాలు ధ్వంసమవగా పలువురు తెదేపా నేతలకు గాయాలయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

నేతల గృహ నిర్బంధం
నేతల గృహ నిర్బంధం

తెదేపా నేతలు తలపెట్టిన చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని తంబళ్లపల్లె పరిధిలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని తెలిపారు. జిల్లాలో పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు.

తిరుపతిలో నరసింహయాదవ్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మదనపల్లెలో శంకర్‌యాదవ్‌, చిత్తూరులో దొరబాబు, నానిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లెకు వెళ్తున్న శ్రీకాళహస్తి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కడపలో గోవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లె వెళ్తున్న తెదేపా నేత శ్రీనివాసరెడ్డిని కడప జిల్లా రామాపురం వద్ద పోలీసులు అరెస్టు చేసి..ఆయన స్వగ్రామం లక్కిరెడ్డిపల్లెకు తరలించారు. కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.....కార్యకర్తలు నిరసనకు దిగారు.

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

కలికిరి మండలం నగిరిపల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కచ్చితంగా వారం, పది రోజుల్లో భారీ ఎత్తున తంబళ్లపల్లెకు వెళ్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

అంగళ్లులో అలజడి..తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడి

తెదేపా 'చలో తంబళ్లపల్లె': ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

ఇటీవల తంబళ్లపల్లెలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు తెలుగుదేశం నేతలు వెళ్తుండగా మార్గమధ్యంలో వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తెలుగుదేశం నేతల వాహనాలను అడ్డుకున్న వైకాపా శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో తెదేపా నేతల వాహనాలు ధ్వంసమవగా పలువురు తెదేపా నేతలకు గాయాలయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఇవాళ చలో తంబళ్లపల్లె కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

నేతల గృహ నిర్బంధం
నేతల గృహ నిర్బంధం

తెదేపా నేతలు తలపెట్టిన చలో తంబళ్లపల్లె కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కరోనా దృష్ట్యా ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని తంబళ్లపల్లె పరిధిలో 30 పోలీసు యాక్టు అమల్లో ఉందని తెలిపారు. జిల్లాలో పలువురు తెలుగుదేశం నేతలను గృహనిర్బంధం చేశారు.

తిరుపతిలో నరసింహయాదవ్‌, పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మదనపల్లెలో శంకర్‌యాదవ్‌, చిత్తూరులో దొరబాబు, నానిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లెకు వెళ్తున్న శ్రీకాళహస్తి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కడపలో గోవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. తంబళ్లపల్లె వెళ్తున్న తెదేపా నేత శ్రీనివాసరెడ్డిని కడప జిల్లా రామాపురం వద్ద పోలీసులు అరెస్టు చేసి..ఆయన స్వగ్రామం లక్కిరెడ్డిపల్లెకు తరలించారు. కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.....కార్యకర్తలు నిరసనకు దిగారు.

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

కలికిరి మండలం నగిరిపల్లిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కచ్చితంగా వారం, పది రోజుల్లో భారీ ఎత్తున తంబళ్లపల్లెకు వెళ్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

అంగళ్లులో అలజడి..తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడి

Last Updated : Dec 12, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.