చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడాంలో విద్యుత్ తీగలు తగిలి గీత కార్మికుడు మృతిచెందాడు. తమిళనాడులోని పల్లాల కుప్పానికి చెందిన జగదీశ్ వేడాంలో కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కల్లు గీయడానికి చెట్టు ఎక్కుతుండగా కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మరణించాడు.
ఇవీ చదవండి... 'ఆర్బీసీ' నుంచి రాయితీపై డ్రిప్ పరికరాలు