ETV Bharat / state

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్.. 9 దుంగలు స్వాధీనం

author img

By

Published : Feb 6, 2021, 8:09 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో ఉదయం ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మిగతా తమిళ స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.

red sandal wood smugglers arrested in seshachalam forest area
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్.. 9 దుంగలు స్వాధీనం

శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ నిరంతర కూంబింగ్ కొనసాగుతుండగా.. ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అటవీశాఖ, పోలీసులు, ప్రత్యేక కార్యదళం (టాస్క్ ఫోర్స్) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని నిలువరించలేకపోతున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో కొంతమంది ఎర్రచందనం దుంగలతో టాస్క్ ఫోర్స్ అధికారులకు తారసపడ్డారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లర్లు తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం ప్రాంతానికి చెందిన చిన్న తంబి, గోవిందరాజు, మణిలను గుర్తించారు. వీరిని టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్​కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.

శేషాచల అడవుల్లో టాస్క్​ఫోర్స్ నిరంతర కూంబింగ్ కొనసాగుతుండగా.. ఈ రోజు ఉదయం చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అటవీశాఖ, పోలీసులు, ప్రత్యేక కార్యదళం (టాస్క్ ఫోర్స్) ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని నిలువరించలేకపోతున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అడవుల్లో అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో కొంతమంది ఎర్రచందనం దుంగలతో టాస్క్ ఫోర్స్ అధికారులకు తారసపడ్డారు. అధికారుల రాకను పసిగట్టిన స్మగ్లర్లు దుంగలను పడేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరి వద్ద నుంచి తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లర్లు తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం ప్రాంతానికి చెందిన చిన్న తంబి, గోవిందరాజు, మణిలను గుర్తించారు. వీరిని టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్​కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ చంద్రశేఖర్ తెలియజేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి:

తిరుమలలో భక్తుల రద్దీ.. పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.