ETV Bharat / state

రాష్ట్రానికి చిత్తూరు వీరజవాన్ ప్రవీణ్ పార్థివ దేహం

author img

By

Published : Nov 10, 2020, 10:30 PM IST

కశ్మీర్​లో వీరమరణం పొందిన చిత్తూరుకు చెందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించారు. తెలంగాణ జవాన్ మహేశ్ పార్థీవదేహన్ని సైతం అతని స్వగ్రామానికి తరలించారు.

SOLDIERS DEAD BODIES
స్వస్థలానికి చిత్తూరు వీరజవాన్ పార్థివ దేహం
స్వస్థలానికి చిత్తూరు వీరజవాన్ పార్థివ దేహం

కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి పార్థివదేహం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అంతకుముందు.. జవాన్ ప్రవీణ్ తో పాటు.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో అమర జవాన్ మహేష్ పార్థీవదేహాలను.. జమ్ముకశ్మీర్ నుంచి హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. ఆ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కమలేశ్వర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి చిత్తూరుకు చెందిన వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ప్రత్యేక అంబులెన్స్​లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి మహేశ్​ పార్థీవదేహాన్నితరలించారు.

స్వస్థలానికి చిత్తూరు వీరజవాన్ పార్థివ దేహం

కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాన్ ప్రవీణ్​కుమార్ రెడ్డి పార్థివదేహం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అంతకుముందు.. జవాన్ ప్రవీణ్ తో పాటు.. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో అమర జవాన్ మహేష్ పార్థీవదేహాలను.. జమ్ముకశ్మీర్ నుంచి హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. ఆ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌, నార్త్‌జోన్‌ డీసీపీ కమలేశ్వర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి చిత్తూరుకు చెందిన వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ప్రత్యేక అంబులెన్స్​లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లికి మహేశ్​ పార్థీవదేహాన్నితరలించారు.

ఇదీ చూడండి:

వీర జవాన్ మహేశ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.