ETV Bharat / state

ఇసుక టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 4 టిప్పర్లను సీజ్ చేసినట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

author img

By

Published : May 22, 2020, 4:17 PM IST

sand seized in chittoor dst sathayvedu consistency
sand seized in chittoor dst sathayvedu consistency

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలం అరుణానది నుంచి... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రిశాంత్ రెడ్డి సీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో... యథేచ్ఛగా ఎలాంటి ఆన్లైన్ బిల్లు లేకుండా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అందించిన సమాచారం మేరకు ఎస్పీ రిశాంత్ రెడ్డి తన బృందంతో దాడులు నిర్వహించారు. 4 టిప్పర్లు, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలం అరుణానది నుంచి... అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రిశాంత్ రెడ్డి సీజ్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో... యథేచ్ఛగా ఎలాంటి ఆన్లైన్ బిల్లు లేకుండా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రత్యేక నిఘా విభాగం అధికారులు అందించిన సమాచారం మేరకు ఎస్పీ రిశాంత్ రెడ్డి తన బృందంతో దాడులు నిర్వహించారు. 4 టిప్పర్లు, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి రాష్ట్రంలో 25 నైపుణ్య శిక్షణా కళాశాలలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.