ETV Bharat / state

బైరెడ్డిపల్లిలో ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి - road accident news in baireddypalli

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ముందుగా వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి
ఆటో, ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి
author img

By

Published : Jun 19, 2020, 5:06 PM IST

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని ట్రాక్టర్ ఢీకొట్టగా ఓ మహిళ మృతిచెందింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాతపేట గ్రామం వద్ద ముందుగా వెళ్తున్న ఆటోను ట్రాక్టర్​ ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఆరుగురికి తీవ్ర గాయాలవగా ఓ మహిళ మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు వెంగమవారిపల్లి, కడపనత్తంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని ట్రాక్టర్ ఢీకొట్టగా ఓ మహిళ మృతిచెందింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పాతపేట గ్రామం వద్ద ముందుగా వెళ్తున్న ఆటోను ట్రాక్టర్​ ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఆరుగురికి తీవ్ర గాయాలవగా ఓ మహిళ మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు వెంగమవారిపల్లి, కడపనత్తంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: నాటు బండ్లను ఢీకొట్టిన లారీ.. రెండు ఎడ్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.