ETV Bharat / state

ద్విచక్ర వాహనం ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. ఒకరు మృతి - road accident at chittor

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్య గారి పల్లి తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి మరణించాడు.

road accident at nagiyyagari palli, one died
road accident at nagiyyagari palli, one died
author img

By

Published : Jun 3, 2021, 10:11 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్య గారి పల్లి తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి మృతి చెందాడు.

కొట్టాల గ్రామం నుంచి రాజా అనే వ్యక్తి తిరుపతికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్య గారి పల్లి తిరుపతి- అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజా అనే వ్యక్తి మృతి చెందాడు.

కొట్టాల గ్రామం నుంచి రాజా అనే వ్యక్తి తిరుపతికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.