ETV Bharat / state

శేషాచలం అడవుల్లో.. ఏడు ఎర్రచందనం దుంగల పట్టివేత

author img

By

Published : May 6, 2021, 3:27 PM IST

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న అధికారులకు గురువారం తెల్లవారుజామున ఒక కారు లోడింగ్ పాయింట్ వద్ద.. ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠా కనిపించింది. గమనించిన దుండగులు.. వెంటనే పారిపోయారు.

red sandal caught at pulicharla
red sandal caught at pulicharla

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కొత్తపేట వద్ద 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి మంగళం పేట బీట్లో కూంబింగ్ చేస్తున్న అధికారులకు గురువారం తెల్లవారుజామున ఒక కారు... లోడింగ్ పాయింట్ వద్ద కనిపించింది. అక్కడకు వెళ్లగా కొంతమంది కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూడగానే దుండగులు అక్కడినుంచి పారిపోయారు. 7 ఎర్రచందనం దుంగలతోపాటు, ఓ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలోకి పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ ఎస్సై మోహన్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కొత్తపేట వద్ద 7 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి మంగళం పేట బీట్లో కూంబింగ్ చేస్తున్న అధికారులకు గురువారం తెల్లవారుజామున ఒక కారు... లోడింగ్ పాయింట్ వద్ద కనిపించింది. అక్కడకు వెళ్లగా కొంతమంది కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూడగానే దుండగులు అక్కడినుంచి పారిపోయారు. 7 ఎర్రచందనం దుంగలతోపాటు, ఓ కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడవిలోకి పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ ఎస్సై మోహన్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.