చిత్తూరు జిల్లాలోని ఊరందూరు పంచాయతీని శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ చర్యకు నిరసనగా తిరుపతి ఉపఎన్నికలను బహిష్కరించాలని అక్కడి స్థానికులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు.
గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు..
శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది జనాభా ఉంది. రెండు వేల ఓటర్లు కలిగిన ఈ పంచాయతీని పురపాలక సంఘంలో విలీనం చేసేందుకు గతంలో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులంతా ఏకమై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కారణాల వల్ల ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామమైన ఊరందూరులో ఎన్నికలను బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి:
వైకాపా సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: శైలజానాథ్