ETV Bharat / state

పిచ్చినాయుడుపల్లి ఎస్సీ కాలనీలో  15 ఇళ్లకు కరెంట్ కట్ - పిచ్చినాయుడుపల్లి దళితవాడ వార్తలు

విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ఓ ఎస్సీ కాలనీలోని 15 ఇళ్లకు విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు పల్లి పంచాయతీ పరిధిలో జరిగింది. సాధారణంగా వచ్చే కరెంట్ బిల్లుకంటే కరోనా కాలంలో వేలబిల్లులను వేశారని బాధితులు వాపోయారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. వానలు పడుతున్న సమయంలో విద్యుత్ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

dalit houses in Pichinayudupalli
పిచ్చినాయుడుపల్లి దళితవాడలో 15 ఇళ్లకు కరెంట్ కట్
author img

By

Published : Oct 16, 2020, 8:44 PM IST


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీలో విద్యుత్​శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ బకాయిలు ఉన్నాయనే కారణంతో సుమారు15 ఇళ్లల్లో కరెంట్ కట్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేయడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నించారు. దళితులపై అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. కరోనా కారణంగా గత రెండు నెలల నుంచి కరెంట్ బిల్లులు చెల్లించలేదు ... అధికారులు అక్టోబర్ నెలలో వేసిన బిల్లులు చూసి అవాక్కయ్యారు. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే పదింతలు ఎక్కువ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. మరోవైపు వర్షాలు పడుతున్న అధికారులు కరెంట్‌ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలు కలిపి వేల రూపాయల బిల్లులు వచ్చాయని ...అధికారులు స్పందించి కరెంట్ బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సమయం కేటాయించాలని వేడుకుంటున్నారు.


చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీలో విద్యుత్​శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ బకాయిలు ఉన్నాయనే కారణంతో సుమారు15 ఇళ్లల్లో కరెంట్ కట్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరెంట్ కట్ చేయడం ఏంటని గ్రామస్థులు ప్రశ్నించారు. దళితులపై అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపించారు. కరోనా కారణంగా గత రెండు నెలల నుంచి కరెంట్ బిల్లులు చెల్లించలేదు ... అధికారులు అక్టోబర్ నెలలో వేసిన బిల్లులు చూసి అవాక్కయ్యారు. సాధారణంగా వచ్చే బిల్లుల కంటే పదింతలు ఎక్కువ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కోవిడ్ వల్ల ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. మరోవైపు వర్షాలు పడుతున్న అధికారులు కరెంట్‌ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలు కలిపి వేల రూపాయల బిల్లులు వచ్చాయని ...అధికారులు స్పందించి కరెంట్ బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సమయం కేటాయించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి. సాగర్​కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.