ETV Bharat / state

శ్రీకాళహస్తి లంకమిట్ట వద్ద పూరిల్లు దగ్ధం.. వృద్ధ దంపతులు సజీవ దహనం

author img

By

Published : Feb 8, 2022, 1:44 PM IST

Updated : Feb 8, 2022, 2:42 PM IST

వృద్ధ దంపతులు సజీవ దహనం
వృద్ధ దంపతులు సజీవ దహనం

13:40 February 08

శ్రీకాళహస్తి లంకమిట్ట వద్ద పూరిల్లు దగ్ధం.. వృద్ధ దంపతులు సజీవ దహనం

CRIME: ఆ దంపతులిద్దరూ వృద్ధులు.. చలి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. కానీ అవే వాళ్ల ప్రాణాలు తీస్తాయని ఊహించలేకపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

శ్రీకాళహస్తి లంక మిట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసె దగ్ధం కావడంతో వృద్ధ దంపతులు సజీవ దహనం అయ్యారు. పట్టణానికి చెందిన వెంకట ముని (85), లక్ష్మమ్మ(75)లు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం అర్ధరాత్రి పూరిగుడిసెలో చలిమంటలు వేయడంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పు అంటుకుంది. బయటకు రాలేని పరిస్థితిలో మంటల్లో సజీవదహనం అయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:
మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ

13:40 February 08

శ్రీకాళహస్తి లంకమిట్ట వద్ద పూరిల్లు దగ్ధం.. వృద్ధ దంపతులు సజీవ దహనం

CRIME: ఆ దంపతులిద్దరూ వృద్ధులు.. చలి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. కానీ అవే వాళ్ల ప్రాణాలు తీస్తాయని ఊహించలేకపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

శ్రీకాళహస్తి లంక మిట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ పూరి గుడిసె దగ్ధం కావడంతో వృద్ధ దంపతులు సజీవ దహనం అయ్యారు. పట్టణానికి చెందిన వెంకట ముని (85), లక్ష్మమ్మ(75)లు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సోమవారం అర్ధరాత్రి పూరిగుడిసెలో చలిమంటలు వేయడంతో ఒక్కసారిగా గుడిసెకు నిప్పు అంటుకుంది. బయటకు రాలేని పరిస్థితిలో మంటల్లో సజీవదహనం అయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:
మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ

Last Updated : Feb 8, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.