సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి... గాంధీజీ సంకల్పయాత్ర సంయుక్త వేడుకలను తమిళనాడు భాజపా ఆధ్వర్యంలో చెన్నైలోని షెనాయ్నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. సమైక్య భారతావనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు గుర్తుచేశారు.
ఇదీ చూడండి: 'మనమంతా... పటేల్ ఆశయాల కోసం పాటుపడాలి'