ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు - undefined

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్
author img

By

Published : Jul 7, 2019, 10:38 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి మంత్రివర్గంలో తనకు చోటు దక్కడం అదృష్ణమని అన్నారు. జగన్​కు ఆరోగ్య, ఐశ్వర్యాలను కల్పించాలని ఆ దేవదేవుడిని వేడుకున్నానని ధర్మాన తెలిపారు. నవరత్నాల అమల్లో తమ ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాలని...అప్పుడే జగన్మోహన్​రెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి మంత్రివర్గంలో తనకు చోటు దక్కడం అదృష్ణమని అన్నారు. జగన్​కు ఆరోగ్య, ఐశ్వర్యాలను కల్పించాలని ఆ దేవదేవుడిని వేడుకున్నానని ధర్మాన తెలిపారు. నవరత్నాల అమల్లో తమ ప్రభుత్వం పూర్తిగా సఫలం కావాలని...అప్పుడే జగన్మోహన్​రెడ్డి ఆకాంక్ష నెరవేరుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా మంత్రి

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్మశాన వాటికను శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు చెత్త తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. శవాలను కాల్చిన తర్వాత వాటి అవశేషాలను ఎక్కడికక్కడ వదిలివేయడం చూసిన ఆయన చలించిపోయారు. ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన స్మశానవాటిక దుస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రనకా పగలనకా కష్టపడి 3 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి స్మశాన వాటికను సుందరీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహరిస్తే భవిష్యత్తులో వారానికి రెండు రోజులు స్మశాన వాటికnu శుభ్రం చేసే ఎందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు


Body:స్మశాన వాటికను శుభ్రం చేసిన ఎమ్మెల్యే


Conclusion:స్మశానవాటికలో ఎమ్మెల్యే

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.